మూగజీవాలకు రక్త నమూనాల సేకరణ
ABN , First Publish Date - 2022-05-17T03:44:57+05:30 IST
మండలంలోని కృష్ణంపల్లి గ్రామంలో బొందికాళ్ల బాలయ్య, మాలకొండయ్యలకు చెందిన మూగజీవాలకు సోమవారం పశు శాఖా సిబ్బంది రక్త నమూనాలు సేకరించారు.
ఉదయగిరి, మే 16: మండలంలోని కృష్ణంపల్లి గ్రామంలో బొందికాళ్ల బాలయ్య, మాలకొండయ్యలకు చెందిన మూగజీవాలకు సోమవారం పశు శాఖా సిబ్బంది రక్త నమూనాలు సేకరించారు. ఉదయగిరి పశు సంచాలకుల కార్యాలయంలోని ల్యాబ్ టెక్నిషియన్ షేక్ అలీఅహ్మద్ జబ్బునపడ్డ వాటికి రక్త నమూనాలు సేకరించారు. ఈ నమూనాలను నెల్లూరు ల్యాబ్కు పంపి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వైరస్, ఇన్ఫెక్షన్ వల్ల సోకిన జబ్బులను గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యజమానులకు వివరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ పశు శాఖా సిబ్బంది కోణయ్య తదితరులు పాల్గొన్నారు.