BJP Leader: బీజేపీ చిత్తశుద్దిగా అమరావతి రాజధాని కి కట్టుబడి ఉంది: ఆంజనేయ రెడ్డి
ABN , First Publish Date - 2022-07-29T16:59:32+05:30 IST
అమరావతి రాజధానిగా ఉండాలని హైకోర్టు చెప్పిన తీర్పుని లెక్కచేయకుండా ప్రభుత్వం వ్యహరించడం చట్టవ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి అన్నారు.
నెల్లూరు: అమరావతి(Amaravati) రాజధానిగా ఉండాలని హైకోర్టు(High court) చెప్పిన తీర్పుని లెక్కచేయకుండా ప్రభుత్వం వ్యహరించడం చట్టవ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి (Karnati Anjaneya Reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ పాదయత్ర(BJP padayatra) ఈరోజు ప్రారంభంకానున్నట్లు తెలిపారు. బీజేపీ (BJP) చిత్తశుద్దిగా అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu)పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత (Congress leader) అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury)ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని(Kodali nani)కి, చీకోటి ప్రవీణ్ (Chikoti praveen)కు సంబంధం ఏమిటో నిగ్గుతేల్చాలన్నారు. ఈ క్రాప్ లో రూ.140కోట్లు కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, రైతు భరోసా కేంద్రాలు రైతు ద్రోహ కేంద్రాలుగా తయారయ్యాయని ఆంజనేయరెడ్డి వ్యాఖ్యలు చేశారు.