హిందుత్వను ISISతో పోల్చిన ఖుర్షీద్పై బీజేపీ ఫైర్
ABN , First Publish Date - 2021-11-11T17:34:16+05:30 IST
హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త ...
న్యూఢిల్లీ: హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో పోల్చడంపై బీజేపీ మండిపడింది. ఇస్లామిక్ జీహాద్తో హిందుత్వను ముండిపెట్టడం వెనుక ముస్లిం ఓట్లకు గాలం వేసే ఆలోచన గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్)కి ఉందని బీజేపీ సీనియర్ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తప్పుపట్టారు.
''సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో హిందుత్వ కూడా ఐఎస్ఐఎస్, బోక్ హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లామిక్ గ్రూపుల వంటిదేనని రాశారు. సఫ్రాన్ టెర్రర్, ఇస్లామిక్ జీహాద్ ఒకటేననడం ముస్లిం ఓట్లను పొందేందుకు కాకపోతే మరింకెందుకని అనుకోగలం'' అని మాలవీయ ఒక ట్వీట్లో ప్రశ్నించారు.
''సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్'' అనే పేరుతో సల్మాన్ ఖాన్ రచించిన తాజా పుస్తకాన్ని ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోనే 113వ పేజీలో ఆయన హిందుత్వను ఐఎస్ఐఎస్, బొకో హరామ్తో పోల్చారు. ''సనాతన ధర్మం, సాధువులు, బుషులు చెప్పిన క్లాసికల్ హిందూయిజాన్ని... హిందుత్వ వెర్షన్ పక్కన పెట్టేసింది. హిందుత్వ రాజకీయ వెర్షన్ ప్రమాణాలు ఐఎస్ఐఎస్, బొకోహరాం రాజకీయ వెర్షన్ ప్రమాణాలకు సామీప్యం ఉంది'' అని సల్మాన్ ఖుర్షీద్ అందులో పేర్కొన్నారు.
సల్మాన్ ఖుర్షీద్పై క్రిమినల్ ఫిర్యాదు
కాగా, సల్మాన్ ఖుర్షీద్పై ఢిల్లీకి చెందిన వివేక్ గార్గ్ అనే న్యాయవాది క్రిమినల్ ఫిర్యాదు చేశారు. హిందుత్వను టెర్రరిజంతో పోల్చి అవమానించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని గార్గ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.