సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ శ్రేణులు
ABN , First Publish Date - 2022-08-17T05:42:57+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయటానికి నిరసనగా నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
మంథని, ఆగస్టు 16: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయటానికి నిరసనగా నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా సునీల్రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున సంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు రాళ్ళు, కర్రలతో దాడికి పాల్పడటం అమానుషమన్నారు. రాష్ట్రంలో పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వేల్పుల రాజు, ఎడ్ల సదాశివ్, సబ్బని సంతోష్, బోయిని నారాయణ, నాంపెల్లి రమేష్, కోరబోయిన మల్లి కార్జున్, పోతరవేన క్రాంతికుమార్, రేపాక శంకర్, తోట మధూకర్, పబ్బ తిరుపతి, శ్రావణ్, సమర, సాగర్, దేవేందర్, విష్ణు, మనోజ్లు పాల్గొన్నారు.