రైతు పక్షపాతి మోదీ
ABN , First Publish Date - 2020-09-27T07:31:50+05:30 IST
రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించేలా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, మోదీ రైతు పక్షపాతి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, పాకా సత్యనారాయణ అన్నారు....
రైతులకు బీజేపీ సత్కారం
భీమవరం రూరల్, సెప్టెంబరు: రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించేలా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, మోదీ రైతు పక్షపాతి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, పాకా సత్యనారాయణ అన్నారు. బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో యనమదుర్రులో రాట్నాల సత్యనారాయణ అధ్యక్షతన రైతులకు సన్మానం శనివారం నిర్వహించారు. తాతాజీ, పాకా సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే రైతు బిల్లు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకి చెందుతుందన్నారు. అనంతరం రైతులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో అల్లూరి సాయిదుర్గరాజు, ఆరేటి ప్రకాష్, తోట గంగరాజు, మండల ప్రధాన కార్యదర్శి సోము సత్యనారాయణ, తానాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.