మోదీకి ప్రత్యేకంగా పుట్టినరోజు తెలిపేందుకు సిద్ధమైన బీజేపీ ఆఫీసు
ABN , First Publish Date - 2020-09-16T22:29:28+05:30 IST
మోదీ జీవితంలోని కొన్ని ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా మోదీ ప్రధానమంత్రి అయిన అనంతర జీవితానికి సంబంధించిన విశేషాలతో రూపొందించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ జీవితంలోని కొన్ని ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా మోదీ ప్రధానమంత్రి అయిన అనంతర జీవితానికి సంబంధించిన విశేషాలతో రూపొందించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
‘‘రేపు మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలంతా కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మోదీ ప్రజా జీవితంలోని అనేక ఘట్టాలను గుర్తు చేసేలా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. మోదీ హయాంలో ఏర్పడిన నూతన భారత్కు సంబందించిన డిస్ప్లే బోర్డులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి’’ అని స్మృతి ఇరానీ అన్నారు.