బీజేపీని గెలిపించాలి : సంకినేని

ABN , First Publish Date - 2021-04-04T06:14:31+05:30 IST

సాగర్‌ ఉప ఎన్నికలో ప్రజ లు బీజేపీని గెలిపించాలని ఎన్నికల ఇన్‌చార్జి సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రజలను కోరారు.

బీజేపీని గెలిపించాలి : సంకినేని
ప్రచారంలో పాల్గొన్న సంకినేని వెంకటేశ్వర్‌రావు

హాలియా / మాడ్గులపల్లి / గుర్రంపోడు : సాగర్‌ ఉప ఎన్నికలో ప్రజ లు బీజేపీని గెలిపించాలని ఎన్నికల ఇన్‌చార్జి సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రజలను కోరారు. శనివారం ఆయన పార్టీ అభ్యర్థి రవికుమార్‌నాయక్‌ భార్య సంతోషితో కలిసి హాలియా మున్సిపాలిటీలో ప్రచారం చేశారు. అనంంతరం మాట్లాడుతూ రాష్ట్రం లో టీఆర్‌ఎ్‌సకు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. మోడీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అనేక నిధులు మంజూరు చేస్తూ ప్రజల సంక్షేమ ం కోసం ఎన్నో పథకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సాగర్‌ ప్రజలంతా బీజేపీని ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. మాడ్గులపల్లి మం డలంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొని మాట్లాడారు. గుర్రంపోడు మండలంలోని వట్టికోడు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 25కుటు ంబాలు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

Updated Date - 2021-04-04T06:14:31+05:30 IST