CM Ramesh sensational comments: ఎదురు తిరిగితే ఖతం చేస్తామనే ధోరణిలో జగన్..
ABN , First Publish Date - 2022-09-23T18:04:49+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy)పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా రాజ్యంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని ఖతం చేస్తాం’’ అనే దోరణిలో జగన్ ఉన్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం చాలా అన్యాయమన్నారు. జగన్(AP CM) తన నిర్ణయం మార్చుకోవాలని... సొంత చెల్లెలే వ్యతిరేకించారని చెప్పారు. 175 సీట్లు గెలుస్తామని ఎలా చెప్పుకుంటున్నారు... ఏపీ ప్రజలను ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు. అమరావతి రైతుల యాత్రకు బీజేపీ (BJP) అండగా ఉన్నప్పుడు ఎవ్వరూ వారిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో వారి యాత్రకు తాము రక్షణ కవచంగా వుంటామని తెలిపారు. మూడు రాజధానుల అంశం కేంద్రానికి చెప్పి చేస్తున్నామని బీజేపీ మీదకు తోసేస్తున్నారని అన్నారు. అమరావతి రైతులపై దాడి చేస్తే బీజేపీపై దాడి చేసినట్లే అని ఎంపీ సీఎం రమేష్ (BJP MP) తెలిపారు.