వైరల్‌గా మారిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ట్వీట్

ABN , First Publish Date - 2020-05-26T23:12:49+05:30 IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే తనయుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తాజాగా చేసిన...

వైరల్‌గా మారిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ట్వీట్

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే తనయుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తాజాగా చేసిన ఓ ట్వీట్.. ఆ ట్వీట్ చేస్తూ ఆయన పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరణాల సంఖ్య కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో నితేష్ రాణే ఓ ఫొటోను పోస్ట్ చేసి.. ఆ దృశ్యం ముంబై కేఈఎమ్ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి అని ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో.. హాస్పిటల్ కారిడార్‌లో స్ట్రెచర్లపై మృతదేహాలు, ఆ మృతదేహాలపై కప్పబడిన నల్ల దుస్తులు కనిపించాయి.


ముంబైలో కరోనా మృతదేహాలను ఇలా పట్టించుకోకుండా వదిలేశారని చెప్పడమే నితేష్ రాణే ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే.. ఈ ఫొటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవి ఇప్పటి దృశ్యాలు కావని కొందరంటున్నారు. పాత ఫొటోలను ఇప్పటి పరిస్థితికి ముడిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం.. ఇది ఇప్పటి ఫొటోనేనని.. బెస్ట్ సీఎం ఉద్ధవ్ ఏం చేస్తున్నారని.. కరోనా మృతదేహాలను లెక్కించడంలో బిజీగా ఉండొచ్చని ఎద్దేవా చేశారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.



Updated Date - 2020-05-26T23:12:49+05:30 IST