మేడారంలో గవర్నర్‌ను అవమానించారు: Etela

ABN , First Publish Date - 2022-02-20T18:43:31+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారంలో గవర్నర్‌ను అవమాంచారన్నారు.

మేడారంలో గవర్నర్‌ను అవమానించారు: Etela

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారంలో గవర్నర్‌ను అవమాంచారన్నారు. సంస్కారహీనమైన సంప్రదాయానికి కేసీఆర్ తెర తీశారని ఆరోపణలు గుప్పించారు. సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే కేసీఆర్.. సంస్కారం ఏపాటిదో అర్థమవుతోందన్నారు. కేసీఆర్ పుట్టి‌నరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యమని కేసీఆర్‌కు గుర్తుచేస్తున్నాని తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయన్న కేటీఆర్‌వి చిల్లర వ్యాఖ్యలు ఆయన మండిపడ్డారు. ప్రజా ఆగ్రహం తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబయ్ పర్యటనకు వెళ్లాడని అన్నారు. జాతీయ పార్టీ లేకుండా.. ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు లేకపోవడంతో తెలంగాణ యువకులకు పెళ్ళిళ్లు కావటంలేదన్నారు. ఉద్యోగ నియామకాలపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వీఆర్వోవోలను తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఈటల రాజేదందర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-20T18:43:31+05:30 IST