బెంగాల్లో గూండా రాజకీయాలు సహించం
ABN , First Publish Date - 2021-05-06T07:49:56+05:30 IST
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ గూండా రాజకీయాలను సహించేది లేదని బీజేపీ సీనియర్ నాయకుడు రావూరి లక్ష్మణస్వామి (సుధ) అన్నారు.
పాలకొల్లు అర్బన్, మే 5: పశ్చిమ బెంగాల్లో టీఎంసీ గూండా రాజకీయాలను సహించేది లేదని బీజేపీ సీనియర్ నాయకుడు రావూరి లక్ష్మణస్వామి (సుధ) అన్నారు. బుధవారం ఆయన నల్లదుస్తులు ధరించి ఈ మేరకు నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి దోషులను కఠినంగా శిక్షించాలని సుధ డిమాండ్ చేశారు.
భీమవరం టౌన్: పశ్చిమ బెంగాల్లలో బిజేపి కార్యకర్తలపై దాడులు ఆపాలని, ఆస్తులన్ని పరిరక్షించాలని, ఈ దాడులకు మమతా బెనర్జీ భాద్యత వహించాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు కాయిత సురేంద్ర డిమాండ్ చేసారు. బెంగాల్లో బిజెపీ, కార్యకర్తలు, ఆస్తులపైన దాడులు చెయ్యటంతోపాటు హత్యలు చేసి ఆడపడుచులపూ ఆత్యాచారాలకు పాల్పడిన సంఘటనలపై బిజెపి జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారంనాడు ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆచంట: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో అరాచక పాలన సాగుతోందని బీజేపీ మండల అధ్యక్షుడు ముత్యర్ల నాగసుబ్బారావు ఆరోపించారు. దీనికి నిరసనగా బుధవారం తన ఇంటి వద్ద ఉదయం గంట సేపు నిరసన దీక్ష చేసినట్లు తెలిపారు.
ఉండి: బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ దాడులకు పాల్పడిందని, దీంతో అధిష్ఠానం పిలుపు మేరకు నిరసన తెలిపినట్టు నరసాపురం పార్లమెంటు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పేరిచర్ల సుభాష్రాజు తెలిపారు.