పోలీసుల అదుపులో బీజేపీ నాయకులు

ABN , First Publish Date - 2022-05-17T03:50:19+05:30 IST

తాడేపల్లి ఎస్సీ కార్పొరేషన్‌ వద్ద మంగళవారం జరుగనున్న ధర్నా కార్యక్రమానికి వెళ్లనీయకుండా మండలంలోని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో బీజేపీ నాయకులు
పోలీసు స్టేషన్‌లో బీజేపీ నాయకులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ

అల్లూరు, మే 16 : తాడేపల్లి ఎస్సీ కార్పొరేషన్‌ వద్ద మంగళవారం జరుగనున్న ధర్నా కార్యక్రమానికి వెళ్లనీయకుండా మండలంలోని  బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి 8.30 వరకు పోలీసు స్టేషన్‌లోనే ఉంచుకొని తరువాత విడుదల చేశారు. వీరిలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎల్లు సాల్మన్‌రాజు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దర్శిగుంట వాసు, బీజేపీ నాయకుడు గోవిందయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా విడుదలయ్యే నిధులను దారిమళ్లించి ఎస్సీ యువతకు ఎటువంటి రుణాలు మంజూరు కాకుండా చేయడంతోపాటు ఎస్సీ వర్గ అభివృద్ధిని కుటుంపడేలా చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై గళం విప్పేందుకు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను విజయవంతం చేయకుండా పోలీసు వ్యవస్థను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందని విమర్శించారు.

Updated Date - 2022-05-17T03:50:19+05:30 IST