ప్రజలను మభ్యపెడుతున్న జగన్
ABN , First Publish Date - 2020-11-30T05:52:02+05:30 IST
సీఎం జగన్ జైలుకెళ్తే రోడ్డుమీద బైఠాయించేందుకు ఉపయోగపడతారని ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
బీజేపీ ఆత్మీయ అభినందన సభలో మాట్లాడుతున్న సత్యకుమార్
అనంతపురం అర్బన్,నవంబరు 29 : సీఎం జగన్ జైలుకెళ్తే రోడ్డుమీద బైఠాయించేందుకు ఉపయోగపడతారని ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన ఆదివారం ఆయనకు ఆత్మీయ అభినంద సభ నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు, కా ర్యకర్తలు సత్యకుమార్ను గజమాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారిత గురించి మాట్లాడుతున్న వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కేవలం తన స్వార్థం, తన కుటుంబాన్ని రక్షించుకోడానికి రాష్ట్ర ప్రజాప్రయోజనాలను, సంక్షేమాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ఫణంగా పెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న పథకాలకు జగన్న, వైఎస్సార్ పేరుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆగడాలను గమనిస్తున్న ప్రజలు సరైన సమయంలో బుద్దిచెబుతారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కార్యదర్శి కనంపల్లి చిరంజీవిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు వజ్రగిరి భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.