నిజాంకు, కేసీఆర్కు ఎలాంటి తేడా లేదు: Laxman
ABN , First Publish Date - 2021-09-17T15:34:06+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మజ్లిస్ పార్టీకి లొంగి.. కేసీఆర్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. చరిత్ర వెలుగులోకి వస్తే మజ్లీస్కు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదని హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను తెరమరుగు చేస్తున్నారన్నారు. నిజాంకు, కేసీఆర్కు ఎలాంటి తేడా లేదని...ఊసర వెల్లిలా కేసీఆర్ రంగులు మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరుస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు.