Dmk కూటమి నుంచి వైదొలుగుతారా?
ABN , First Publish Date - 2022-05-20T18:16:29+05:30 IST
పేరరివాలన్ విడుదల వ్యవహారంలో డీఎంకే కూటమి నుంచి వైదొలిగేందుకు కాంగ్రెస్ సిద్ధమా.. అని బీజేపీ నాయకురాలు ఖుష్బూ ప్రశ్నించారు. రాజీవ్గాంధీ
- Congressకు ఖుష్బూ ప్రశ్న
పెరంబూర్(చెన్నై): పేరరివాలన్ విడుదల వ్యవహారంలో డీఎంకే కూటమి నుంచి వైదొలిగేందుకు కాంగ్రెస్ సిద్ధమా.. అని బీజేపీ నాయకురాలు ఖుష్బూ ప్రశ్నించారు. రాజీవ్గాంధీ హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ చర్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ వ్యవహారంపై ఖుష్బూ తన ట్విట్టర్లో, పేరరివాలన్ విడుదల అనంతరం ముఖ్యమంత్రి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. కానీ బీజేపీ రాజకీయం చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పేరరివాలన్ వ్యవహారంలో డీఎంకే కూటమి నుంచి వైదొలిగేందుకు కాంగ్రెస్ సిద్ధమా? ముఖ్యమంత్రి చర్యలు ఖండిస్తారా? వెన్నుపోటు రాజకీయాలకు కాంగ్రెస్ యత్నిస్తోంది అంటూ ఖుష్బూ పోస్ట్ చేశారు.