రామాలయానికి టీటీడీ రూ.100కోట్లు కేటాయించాలి: బీజేపీ నేత
ABN , First Publish Date - 2021-02-27T15:11:06+05:30 IST
అయోధ్య రామాలయ నిర్మాణానికి టీటీడీ ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుమల: అయోధ్య రామాలయ నిర్మాణానికి టీటీడీ ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా ప్రజలందరూ విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ఈరోజు జరిగే పాలకమండలి సమావేశంలో టీటీడీ ఈ మేరకు తీర్మానం చేయాలని భానుప్రకాష్రెడ్డి కోరారు.