దళితులే హిందూ ధర్మ రక్షకులు: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-02-27T18:33:33+05:30 IST

దళితులే హిందూ ధర్మ రక్షకులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు.

దళితులే హిందూ ధర్మ రక్షకులు: బండి సంజయ్

హైదరాబాద్: దళితులే హిందూ ధర్మ రక్షకులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. శనివారం  బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంత్ శిరోమణి రవిదాస్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  సీఎం కేసీఆర్‌కు పేదల జయంతి కార్యక్రమాలు గుర్తుండవని విమర్శలు గుప్పించారు. అంబేద్కర్, సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేయదని ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేస్తామన్న అంబేద్కర్ భారీ విగ్రహం ఎక్కడ? అని నిలదీశారు. మోచీలకు చెప్పులు కుట్టడమే కాదు..  మొలలు కొట్టడం కూడా వచ్చు అని హెచ్చరించారు.  బీసీ ఆత్మగౌరవ భవనాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.  సీఎం కేసీఆర్ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.  దళితులు జాగృతం అయ్యి.. ఏకతాటిపైకి రావాలి బండి సంజయ్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-02-27T18:33:33+05:30 IST