అన్ని పంచాయతీల్లో బీజేపీ, జనసేన సమష్టి పోటీ
ABN , First Publish Date - 2021-01-25T06:46:00+05:30 IST
పంచాయతీ ఎన్నికల్లో బీజేపీతో కలిపి అన్ని పంచాయతీల్లో పోటీ చేద్దామని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్కుమార్ అన్నారు.
జనసేన నేత సుందరపు విజయ్కుమార్
మునగపాక, జనవరి 24 : పంచాయతీ ఎన్నికల్లో బీజేపీతో కలిపి అన్ని పంచాయతీల్లో పోటీ చేద్దామని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్కుమార్ అన్నారు. మునగపాక జనసేన కార్యాలయంలో ఆదివారం ఇరు పార్టీల కార్యకర్తలతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. అండగా తాను ఉంటానని, అన్ని పంచాయతీల్లో పోటీ చేయాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బీజేపీ నాయకులు బద్దెం సూర్యనారాయణ, బుద్ద విశ్వనాథం, జనసేన నాయకులు పెంటకోట స్వరూప్, కాళ్ల చంద్రమోహన్, కె.పరదేశిరావు, కోరుకొండ ప్రసాద్, విల్లూరి నూకనరసింగరావు తదితరులు పాల్గొన్నారు.