బీజేపీని విమర్శించే స్థాయి వైసీపీకి లేదు

ABN , First Publish Date - 2021-08-02T05:52:18+05:30 IST

బీజేపీని విమర్శించే స్థాయి వైసీపీకి, ఆపార్టీ ఎమ్మెల్యేలకులేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు.

బీజేపీని విమర్శించే స్థాయి వైసీపీకి లేదు

అనంతపురం అర్బన, ఆగస్టు1: బీజేపీని విమర్శించే స్థాయి వైసీపీకి, ఆపార్టీ ఎమ్మెల్యేలకులేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ ఆ ధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఆయ్యవారిపాలెంలో వైసీపీ గుండాలు బీజేపీ కార్యకర్తలపై దాడిచేశారన్నారు. ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మాత్రం రెండు కుటుంబాల మధ్యజరిగిన దాడిగా అభివర్ణించి గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధానకార్యదర్శి విష్ణువర్ధనరెడ్డిపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హిందువుల వ్యతిరేకి అయిన టిప్పూసుల్తాన విగ్రహాన్ని శివప్రసాద్‌రెడ్డి ఎలా ఏర్పాటు చేయిస్తారని మండిపడ్డారు. కార్యక్రమంలో మీడియా ప్యానలిస్ట్‌ దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి, నాయకులు లలిత, ఫ యాజుద్దీన, ఆదిశేషు, సూర్యప్రకా్‌షరెడ్డి, శ్రీనివాసులు, శ్రీధర్‌, నాగేంద్ర, గోవర్ధన, సురేష్‌, కాటమయ్య, హరి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:52:18+05:30 IST