మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ
ABN , First Publish Date - 2022-08-11T06:05:31+05:30 IST
పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా బీజేపీ మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ మాదిగ అన్నారు.
భువనగిరి రూరల్/ భువనగిరి టౌన, ఆగస్టు 10: పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా బీజేపీ మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం నల్లజెండాలతో నిరసన తెలిపి మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉండి కూడా వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించడం లేదని, మాదిగలకు వ్యతిరేకంగా బీజేపీ నిరంకుశ పాలన సాగిస్తోందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే 100 రోజుల్లో వర్గీకరణ చేపడుతామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ 8సంవత్సరాలు గడుస్తున్నా తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేదని మండిపడ్డారు. అనంతరం కలెక్టరేట్ ఏవో ఎం.నాగేశ్వరచారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఇటికాల దేవేందర్, నల్ల చంద్రస్వామి, దొబ్బ రామకృష్ణ, కె హరీశ, సందెల శ్రీనివాస్, అంజయ్య, లక్ష్మీనారాయణ, మహేశ, దేవేందర్, కుమార్, ప్రేమ్ ఉన్నారు.