బీజేపీకి షాక్... ఆధిక్యంలోకి దూసుకెళ్ళిన మమత బెనర్జీ...
ABN , First Publish Date - 2021-05-02T19:21:18+05:30 IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ శాసన సభ నియోజకవర్గంలో ఆధిక్యంలోకి దూసుకెళ్ళారు. జాతీయ మీడియా తెలిపిన సమాచారం ప్రకారం తొమ్మిదో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సుమారు 2,700 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అంతకుముందు ఆమె సువేందు అధికారికన్నా సుమారు 8 వేల ఓట్ల మేరకు వెనుకబడి ఉండేవారు. 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత మమత బెనర్జీ 3,372 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. నందిగ్రామ్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో జరుగుతుంది.