కాంగ్రెస్ చూపిన బాటలో బీజేపీ దూసుకెళ్తోంది : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2020-06-05T02:09:41+05:30 IST

కాంగ్రెస్ చూపిన బాటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూసుకెళ్తోందని

కాంగ్రెస్ చూపిన బాటలో బీజేపీ దూసుకెళ్తోంది : అఖిలేశ్ యాదవ్

లక్నో : కాంగ్రెస్ చూపిన బాటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూసుకెళ్తోందని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వలస కూలీలను, ప్రజలను వంచించిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. 


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచం అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో అట్లాస్ కంపెనీ తన ఫ్యాక్టరీని మూసేసిందని అఖిలేశ్ అన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఈ విధంగా జరుగుతోందని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం లేదన్నారు. ఆర్థిక ప్యాకేజీ నుంచి అట్లాస్ ఫ్యాక్టరీ ఎందుకు లబ్ధి పొందలేదని ప్రశ్నించారు. 


కాంగ్రెస్, బీజేపీ ఒకే బాటలో నడుస్తున్నాయని, అయితే కాంగ్రెస్ చూపిన బాటలో బీజేపీ వేగంగా దూసుకెళ్తోందని దుయ్యబట్టారు. 


Updated Date - 2020-06-05T02:09:41+05:30 IST