పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-04-13T05:15:08+05:30 IST

పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అయిజ లోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

    అయిజ, ఏప్రిల్‌ 12 : పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అయిజ లోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయిజ పట్టణంలో గతంలో బడుగు, బలహీనవర్గాల వారికి ప్లాట్లు ఇచ్చారని, వారందరికీ  డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జలగరి అశోక్‌, మెడికల్‌ తిర్మల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నర్సింహయ్యశెట్టి, హరిప్రసాద్‌, మేకల ఆంజనేయులు, వెంకటేష్‌, గోపి ఆచారి, షరీఫ్‌, పద్మారెడ్డి, ఈదన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:15:08+05:30 IST