బీజేపీలో పలువురి చేరిక
ABN , First Publish Date - 2020-08-13T16:29:41+05:30 IST
బీజేపీలో పలువురి చేరిక
తమిళనాడు: కృష్ణగిరి జిల్లా హోసూరులో పలువురు డీఎంకే నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు నరేంద్రన్ , జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన డీఎంకే జిల్లా మాజీ విద్యా విభాగ నిర్వాహకుడు, తమిళనాడు ఉపాధ్యాయ రాష్ట్ర ఉప కార్యదర్శి, కృష్ణగిరి సరస్వతి విద్యాలయ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ అన్బరసు బీజేపీలో చేరారు. అదే విధంగా హోసూరుకు చెందిన ది ఆక్రిడ్జ్ పాఠశాల కరెస్పాండెంట్ బాబు (లక్ష్మిపతి) కూడా తన అనుచరులతో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్రన్ మాట్లాడుతూ... కరుణానిధి కుటుంబ ఆధిపత్యాన్ని, అరాచకాన్ని తట్టుకోలేక రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన నేతలందరూ డీఎంకేను వీడి.. బీజేపీలో చేరుతున్నారన్నారు. అన్బరసు నరేంద్రన్కు వేలాయుధా న్ని బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో హరి కోటేశ్వరన్, నందకుమార్, రామకృష్ణ, శ్రీనివాసులు, బాబు, మురుగన్ తదితరులు పాల్గొన్నారు.