అదుపు తప్పిన బైకు.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-17T04:46:04+05:30 IST
మాధవరం రోడ్డు గోశాల వద్ద శుక్రవారం బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో తెలంగాణ రాష్ట్రం రాజోలికి చెందిన శేఖర్(51) మృతి చెందగా, హరి అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
మంత్రాలయం, ఏప్రిల్ 16: మాధవరం రోడ్డు గోశాల వద్ద శుక్రవారం బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో తెలంగాణ రాష్ట్రం రాజోలికి చెందిన శేఖర్(51) మృతి చెందగా, హరి అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ వేణుగోపాలరాజు తెలిపిన మేరకు.. మృతుడు శేఖర్ కోసిగి మండలం జంపాపురంలో పనులు ముగించుకొని స్వగ్రామానికి చెందిన హరి అనే వ్యక్తితో కలిసి బైక్పై బయలుదేరాడు. బైక్ వేగంగా నడపడంతో అదుపు తప్పి మురుగు కాలువ డివైడర్కు ఢీ కొట్టింది. శేఖర్ ఎగిరి కిందకు పడి, తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న హరికి చెయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి ఎమ్మిగనూరు ఆస్పత్రికి, అనంతరం కర్నూలుకు తరలించారు. శేఖర్ మృతాదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.