ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2020-11-28T05:03:15+05:30 IST
బేతంచెర్ల - కర్నూలు రహదారిలోని అయ్యలచెరువు ప్రాంతంలో కర్నూలు నుంచి బేతంచెర్లకు బైకుపై వస్తుండగా టైరు పంక్చర్ కావడంతో అదుపతప్పింది.
బేతంచెర్ల, నవంబరు 27: బేతంచెర్ల - కర్నూలు రహదారిలోని అయ్యలచెరువు ప్రాంతంలో కర్నూలు నుంచి బేతంచెర్లకు బైకుపై వస్తుండగా టైరు పంక్చర్ కావడంతో అదుపతప్పింది. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన సునిల్, అంజి ద్విచక్ర వాహనంపై కర్నూలులో జరిగే వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. యువకులకు బేతంచెర్ల ప్రభుత్వాస్పత్రిలో ప్రఽథమ చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.