బీహార్లో భారీ వర్షాలతో వరద ముప్పు!
ABN , First Publish Date - 2021-06-21T17:56:33+05:30 IST
బీహార్లో గడచిన 24 గంటలుగా...
పట్నా: బీహార్లో గడచిన 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తర బీహార్లోని నదుల నీటి మట్టం పెరిగింది. గంగా, పున్పున్ల నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నదులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. గాంధీ ఘాట్లోని గంగా, శ్రీపాల్పూర్లోని పున్పున్ ప్రమాద సూచికను దాటి ఒకటి నుండి ఒకటిన్నర మీటర్ల ఎత్తు మేరకు ప్రవహిస్తున్నాయి. గంగానది ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నది నీటి మట్టం పెరుగుతూనే ఉన్నదని కేంద్ర జల సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు నదుల నుంచి వరద ముప్పు పొచివుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.