హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన
ABN , First Publish Date - 2021-01-19T06:31:35+05:30 IST
పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన హోరాహోరీగా సాగుతోంది.
పర్చూరు, జనవరి 18:పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన హోరాహోరీగా సాగుతోంది. సోమవారం సబ్జూనియర్స్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో 11 జతల ఎడ్లు పాల్గొన్నాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలేనికి చెందిన కన్నెగంటి శ్రీనివాసరావు ఎడ్లు నిర్ణీత సమయంలో 3316 అడుగుల దూరం లాగి ముందంజలో ఉన్నాయి. తదుపరి అదే జిల్లా తెనాలికి చెందిన బట్టా రమేష్ గిత్తలు 3969 అడుగుల దూరం లాగాయి. అదే జిల్లాకు చెందిన కాకుమాను ఎడ్లు 3809.7 అడుగుల దూరం లాగి ప్రస్తుతం జరుగుతున్న పోటీల్లో రెండో స్థానంలో నిలిచాయి. పోటీలను తిలకించేందుకు ఆయా గ్రామాల నుంచి భారీ సంఖ్యలో పశుపోషకులు, ప్రజలు తరలిరావటంతో ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఫ్లడ్ లైట్ల మధ్య పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.