కరోనా హాట్ స్పాట్స్...ఈ నాలుగు జిల్లాలు
ABN , First Publish Date - 2020-04-06T14:28:42+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, మైసూరు, బెంగళూరు అర్బన్, కలబుర్గీ జిల్లాలు కరోనా వైరస్ హాట్ స్పాట్లుగా...
బీదర్, మైసూరు, బెంగళూరు, కలబుర్గీ జిల్లాల్లో కేసులు అధికం
బెంగళూరు (కర్ణాటక) : కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, మైసూరు, బెంగళూరు అర్బన్, కలబుర్గీ జిల్లాలు కరోనా వైరస్ హాట్ స్పాట్లుగా మారాయి. కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య ఏరోజుకారోజు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప చెప్పారు.
ఏప్రిల్ 14వతేదీతో లాక్ డౌన్ ఎత్తివేయాలా లేదా అనేది ప్రజలు నిబంధనలు పాటించడంపై ఆధారపడి ఉందని సీఎం చెప్పారు. ఏప్రిల్ 14వతేదీన రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించి లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తామని సీఎం పేర్కొన్నారు. బీదర్, మైసూరు, బెంగళూరు, కలబుర్గీ జిల్లాల్లో కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.