బీదర్ ‌- బెంగళూరు విమాన సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-25T17:53:12+05:30 IST

బీదర్‌- బెంగళూరుల మధ్య పౌర విమానయాన సేవలు గురువారం నుంచి మళ్ళీ ప్రారంభం అయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఈ విమాన సేవలు తాత్కాలికంగా రద్దయిన సంగతి విదితమే. కేంద్రమంత్రి, బీదర్‌ ఎంపీ భగవంత్‌

బీదర్ ‌- బెంగళూరు విమాన సేవలు ప్రారంభం

బెంగళూరు: బీదర్‌- బెంగళూరుల మధ్య పౌర విమానయాన సేవలు గురువారం నుంచి మళ్ళీ ప్రారంభం అయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఈ విమాన సేవలు తాత్కాలికంగా రద్దయిన సంగతి విదితమే. కేంద్రమంత్రి, బీదర్‌ ఎంపీ భగవంత్‌ ఖూబా తీసుకున్న చొరవ కారణంగా విమాన సేవలకు శ్రీకారం చుట్టారు. వారంలో మూడు రోజులు అంటే మంగళవారం, గురువారం, ఆదివారం ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు విమానాశ్రయంలో ఉదయం 11-25కు బయల్దేరే ఈ విమానం మధ్యాహ్నం 1-10 గంటలకు బీదర్‌కు చేరుకుంటుంది. బీదర్‌లో ఈ విమానం మధ్యాహ్నం 1-40 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3-25 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోనుంది. బెంగళూరు-బీదర్‌ల మధ్య విమాన ప్రయాణ అవధి 1గంట 45 నిముషాలుగా ఉంటుంది. తొలి దశలో ట్రూజెట్‌ తన విమాన సేవలను ప్రారంభించనుంది. అత్యవసర వేళల్లో నగరానిని ప్రయాణించే ప్రయాణికులకు ఇది బాగా ఉపయోగప డనుందని నిర్వాహకులు వెల్లడించారు.

Updated Date - 2022-02-25T17:53:12+05:30 IST