ద్విచక్రవాహనం- ఆటో ఢీకొని ఒకరు...

ABN , First Publish Date - 2021-01-16T04:55:29+05:30 IST

కేశాపురం దేవళంపేట దగ్గర గురువా రం రాత్రి జరిగిన ప్రమాదంలో బత్తుల రఘునాధ్‌ (40) మృతి చెందినట్లు ఎస్‌ఐ హేమాద్రి తెలిపా రు.

ద్విచక్రవాహనం- ఆటో ఢీకొని ఒకరు...
రఘునాధ్‌ మృతదేహం

చిన్నమండెం, జనవరి 15: కేశాపురం దేవళంపేట దగ్గర గురువా రం రాత్రి జరిగిన ప్రమాదంలో బత్తుల రఘునాధ్‌ (40) మృతి చెందినట్లు ఎస్‌ఐ హేమాద్రి తెలిపా రు.  గుర్రంకొండ మండలం గురికుంటపల్లె వాసి రఘునాధ్‌, అతని భార్య రమణమ్మ ద్విచక్ర వాహనంపై రాయచోటి నుంచి గుర్రంకొండకు వెళుతుండగా కేశాపురం దేవళంపేట నుంచి చిన్నమండెం వెళుతున్న ఆటో డ్రైవర్‌ సాంబ రాంగ్‌రూటులో వచ్చి ఢీకొట్టడంతో రఘునాధ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని భార్యకు చెయ్యి విరగడంతో ఆమెను  చికిత్స కోసం కడప రిమ్స్‌ తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-16T04:55:29+05:30 IST