Uttar Pradesh : బీజేపీ యూపీ చీఫ్గా భూపేంద్ర సింగ్ నియామకం
ABN , First Publish Date - 2022-08-25T21:41:04+05:30 IST
భారతీయ జనతా పార్టీ (BJP) ఉత్తర ప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP) ఉత్తర ప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా చౌదరి భూపేంద్ర సింగ్ (Chaudhary Bhupendra Singh) నియమితులయ్యారు. ఆయన యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మంత్రివర్గంలో మంత్రి కూడా. యోగి, సింగ్లతో బీజేపీ అగ్ర నేతలు ఢిల్లీలో చర్చించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకం జరిగింది.
భూపేంద్ర సింగ్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్కు చెందిన జాట్ నేత. ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బుధవారం సమావేశమయ్యారు. అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఆమోదయోగ్యుడైన నేతను రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమించాలని బీజేపీ అనేక మందిని పరిశీలించింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్లో జాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
యూపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న స్వతంత్ర దేవ్ సింగ్కు యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మంత్రి పదవి లభించింది.