ఆక్రమిత భూములు పంపిణీ చేయాలని నిరసన

ABN , First Publish Date - 2022-08-09T02:53:47+05:30 IST

ఆక్రమిత భూములు పంపిణీ చేయాలని మండలంలోని మక్తాపురం గ్రామానికి చెందిన గిరిజనులు సోమవారం తహసీల్దారు కార్యాల

ఆక్రమిత భూములు పంపిణీ చేయాలని నిరసన
తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న గిరిజనులు

సంగం, ఆగస్టు 8: ఆక్రమిత భూములు పంపిణీ చేయాలని  మండలంలోని మక్తాపురం గ్రామానికి చెందిన గిరిజనులు సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని గిరిజనులకు పంపిణీ చేయాలని ఎంతోమంది అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదన్నారు. ఈ క్రమంలో మాజీ సర్పంచు బుజ్జమ్మ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దారు జయవర్థన్‌కు వినతిపత్రం అందచేశారు. 


Updated Date - 2022-08-09T02:53:47+05:30 IST