చామ కాలువ కట్టను పటిష్టం చేయాలి

ABN , First Publish Date - 2020-09-30T10:55:57+05:30 IST

నంద్యాల పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద వరద ఉధృతితో చామ కాలువ ఒక వైపు కట్ట కోతకు గురైందని, ..

చామ కాలువ కట్టను పటిష్టం చేయాలి

నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి


నంద్యాల, సెప్టెంబరు 29: నంద్యాల పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద వరద ఉధృతితో చామ కాలువ ఒక వైపు కట్ట కోతకు గురైందని, వెంటనే అక్కడ రక్షణ చర్యలు చేపట్టి కోత కోసిన ప్రాంతాన్ని పూడ్చి పటిష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం చామ కాలువ కట్ట తెగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెలలో మొదటిసారి కురిసిన భారీ వర్షాల కారణంగా కొంత వరకు కట్టకు కోతపడిందని అన్నారు.  ఈనెల 25వ తేదీ రాత్రి కురిసిన కుంభవృష్టితో చామకాలువకు భారీగా వరద పోటెత్తడంతో హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద చిన్నగా ఉన్న కట్టకోత మరింత పెద్దదైందని అన్నారు.  వెంటనే భారీగా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చి, పటిష్టం చేసేందుకు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2020-09-30T10:55:57+05:30 IST