మానవత్వం చూపాలి
ABN , First Publish Date - 2021-05-09T06:29:32+05:30 IST
మానవత్వం చూపాలి
ఫఫిర్యాదులు అందితే సహించను
ఫశ్మశాన నిర్వాహకులకు సీఐ కౌన్సెలింగ్
ఉయ్యూరు, మే 8 : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానవత్వం చాటి మనుషులుగా ప్రవర్తిం చాలని, ఫిర్యాదులు అందితే సహించను అని ఉయ్యూరు సీఐ నాగప్రసాద్ అన్నారు. ఉయ్యూరులో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అంబులెన్స్, శ్మశానవాటిక నిర్వాహకులకు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రోగులు, మృతదేహాలను తరలించాలని, అవస రాన్ని బట్టి డబ్బు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు షాడో పార్టీని పెడతామని, శవాలపై పైసలు ఏరుకో వడం మాని మానవత్వంతో మెలగాలని హితవు పలికా రు. పట్టణ ఎస్సై షబ్బీర్ అహ్మద్ డ్రైవ్లో పాల్గొన్నారు.
ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు
ఉయ్యూరు కొవిడ్ కేర్సెంటర్కు కొన్ని ఆక్సిజన్ సిలెం డర్లను సీఐ ఏర్పాటు చేశారు. కొవిడ్ కేర్ సెంటర్కు సరిపడా సిలిండర్లు లేని పరిస్థితుల్లో ఉయ్యూరు చు ట్టుపక్కల ప్రాతాల నుంచి సేకరించి వాటిని వాటిని వైద్యశాలకు అందజేశారు.