అత్యాచార కేసులో ఇద్దరు రైల్వే ఇంజినీర్లు అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-28T09:27:26+05:30 IST
అత్యాచార కేసులో మధ్యప్రదేశ్లో ఇద్దరు రైల్వే ఇంజినీర్లు అరెస్ట్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భోపాల్: అత్యాచార కేసులో ఇద్దరు రైల్వే ఇంజినీర్లు అరెస్ట్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల యువతిపై మధ్యప్రదేశ్లోని భోపాల్ రైల్వే డివిజన్లో పనిచేస్తున్న రైల్వే ఇంజినీర్లు రాజేష్ తివారి, అలోక్ మాల్వియా శనివారం అత్యాచారం చేశారు. భోపాల్ రైల్వేస్టేషన్లోని రైల్వేస్ వీఐపీ గెస్ట్ హౌస్లోనే ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా.. రాజేష్ తివారి తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడని యువతి పోలీసులకు తెలిపింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో.. తాను ఉత్తరప్రదేశ్ నుంచి భోపాల్ వచ్చినట్టు పేర్కొంది. భోపాల్ రైల్వేస్టేషన్లో దిగిన వెంటనే తనను గెస్ట్హౌస్కు తీసుకువెళ్లినట్టు చెప్పింది.
అనంతరం గదిలోకి అలోక్ మాల్వియా అనే వ్యక్తి వచ్చినట్టు వివరించింది. తనకు మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయానని.. అనంతరం తాను అత్యాచారానికి గురైనట్టు తెలిసిందని యువతి తెలిపింది. తనకు మెలకువ వచ్చే సమయానికి గదిలో ఎవరూ లేరని.. తాను వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పానని యువతి పేర్కొంది. కాగా.. అశోక్, అలోక్లను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్టు, వారిపై పలు కేసులు నమోదు చేసినట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రకటించారు.