భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
ABN , First Publish Date - 2022-08-09T03:46:21+05:30 IST
అల్లూరు మసీదు సెంటరులోని మౌలాలి దర్గా వద్ద మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం రాత్రి మౌలాలి పీరు గంధ మహోత్సవం నిర్వహించారు.
అల్లూరు, ఆగస్టు 8 : అల్లూరు మసీదు సెంటరులోని మౌలాలి దర్గా వద్ద మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం రాత్రి మౌలాలి పీరు గంధ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బీద గిరిధర్ మౌలాలీ దర్గాలో ప్రత్యేక ఫాతెహాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీలపరెడ్డి హరీ్షరెడ్డి, రఫీ మాలిక్, బిట్రగుంట చైతన్యరెడ్డి, సయ్యద్ అయూబ్, కృష్ణచైతన్య తదితరులు పాల్గొని మౌలాలి పీరును దర్శించుకున్నారు. అదేవిధంగా అనాదిగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి కాటంరెడ్డి కోదండరామిరెడ్డి నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి మౌలాలి పీరుకు గంధం నిర్వహణ అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. కమిటీ సభ్యులు షేక్ ఉస్మాన్ షరీష్, షబ్బీర్, ఫాజిల్ తదితరుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి తమ భక్తిని చాటారు.