ఘనంగా భీష్మ ఏకాదశి ఉత్సవం
ABN , First Publish Date - 2021-02-24T04:40:37+05:30 IST
కోదండరాముడి కోవెలలో మంగళవారం భీష్మ ఏకాదశి వేడుకను టీటీడీ ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఒంటిమిట్ట, ఫిబ్రవరి23 : కోదండరాముడి కోవెలలో మంగళవారం భీష్మ ఏకాదశి వేడుకను టీటీడీ ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణ సమేత మూలవరులకు పంచామృతాలతో అభిషేకించి నూతన పట్టువస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి నివేదన సమర్పించారు. విష్ణు సహస్త్ర నామార్చనలు, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పారాయణం తదితరాలతో వేదోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ సమేత ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజలునిర్వహించారు.