జిల్లా జడ్జి భీమారావు బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2022-04-21T07:17:17+05:30 IST
చిత్తూరు జిల్లా న్యాయమూర్తిగా ఇ.భీమారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
చిత్తూరు, లీగల్, ఏప్రిల్ 20: చిత్తూరు జిల్లా న్యాయమూర్తిగా ఇ.భీమారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. వెస్ట్ గోదావరి జిల్లా న్యాయమూర్తిగా ఉన్న ఈయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన పార్థసారథి బదిలీపై గుంటూరుకు వెళ్లారు. జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన భీమారావును పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.