బయటపడ్డ 39 మద్యం సీసాలు
ABN , First Publish Date - 2022-07-07T02:51:03+05:30 IST
మండలంలోని యాగర్ల సెంటర్ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 39 మద్యం సీసాలు బయ
ఇందుకూరుపేట, జూలై 6: మండలంలోని యాగర్ల సెంటర్ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 39 మద్యం సీసాలు బయటపడ్డాయి. బుధవారం సాయంత్రం తోటపల్లిగూడూరుకు చెందిన శంకర్ అనే వ్యక్తి మద్యం దుకాణంలో 39 సీసాలు కొనుగోలు చేసి మోటారు సైకిల్పై తరలిస్తూ మస్తాన్ అనే యువకుడిని ఢీ కొట్టాడు. మస్తాన్ను గ్రామస్థులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యంపై పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మద్యం సీసాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ మేరకు ఎస్ఐ ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.