కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-08-09T11:46:38+05:30 IST

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నగరి టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌ అన్నారు.

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

నగరి, ఆగస్టు 8: కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నగరి టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌ అన్నారు. శనివారం నగరి టీడీపీ పట్టణ కార్యదర్శి గుణశేఖర్‌ ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ రోజు రోజుకు ఉధృతంగా వ్యాపిస్తోందని, అదే విధంగా మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ర్యాలీలు, ఊరేగింపులు చేస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని అన్నారు. ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భానుప్రకాష్‌ భరోసా ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ టీడీపీ మాజీ అధ్యక్షుడు రమేష్‌, కార్యదర్శి గుణశేఖర్‌, జ్యోతినాయుడు, సలీం, దయాళన్‌, కేశవులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-09T11:46:38+05:30 IST