ప్రతీ గ్రామానికి భగీరథ నీటిని అందించాలి

ABN , First Publish Date - 2022-05-18T07:12:03+05:30 IST

మండలంలోని ప్రతీ గ్రామానికి మిషన్‌ భగీ రథ నీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ప్రశాంతి కోటయ్య సూచించారు.

ప్రతీ  గ్రామానికి భగీరథ నీటిని అందించాలి
చిలుకూరులో మిషన్‌ భగీరథ ఏఈని ప్రశ్నిస్తున్న సర్పంచ్‌లు

చిలుకూరు, మే 17: మండలంలోని ప్రతీ గ్రామానికి   మిషన్‌ భగీ రథ నీటిని  అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ప్రశాంతి కోటయ్య సూచించారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యా లయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. మాధవగూడెం సర్పంచ్‌ మాదాసు లింగయ్య, సీతారాంపురం సర్పంచ్‌ పులగం రవీందర్‌ మాట్లాడుతూమిషన్‌ భగీరఽథ నీళ్లు  గ్రిడ్‌ ద్వారా ట్యాంకులకు ఎక్కడం లేదని, ట్యాంకుల ద్వారా ఇంటింటికీ సక్ర మంగా సరఫరా కావడంతో లేదన్నారు. నీరు సక్రమంగా అందననందున వేస విలో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు జానీమియా మాట్లాడుతూ అన్ని గ్రామాలకు నీరు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అధికారులు చెప్పే మాట లకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా ఉందన్నారు.  వివిధ శాఖల అధికారులు తమ  నివేదికలను చదివి వినిపించారు. సమావే శంలో తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీవో ఈదయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీ సీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-18T07:12:03+05:30 IST