జగన్మోహిని అలంకారంలో భద్రాద్రి రామయ్య

ABN , First Publish Date - 2020-11-28T04:35:28+05:30 IST

జగన్మోహిని అలంకారంలో భద్రాద్రి రామయ్య

జగన్మోహిని అలంకారంలో భద్రాద్రి రామయ్య
జగన్మోహిని అలంకారంలో రామయ్య


భద్రాచలం, నవంబరు 27: క్షీరాబ్ది ద్వాదశిని (చిలుకు ద్వాదశి) పురస్కరించుకొని శుక్రవారం భద్రాచలం రామయ్య జగన్మోహిని అలంకారంలో భక్తు లకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా అర్చకులు స్వామివారిని అందంగా అలంకరించి మేళతాళాలతో నిత్యకల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అ నంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు  నిర్వహించారు. ఈ సమయంలో దేవస్థానం ఆస్థాన విధ్వాంసులు భక్తరామదాసు, తూము లక్ష్మీనరసింహదాసు  కీర్తనలను ఆలపిస్తుండగా అందుకు అనుగుణంగా ప్రత్యేక హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా స్వామికి క్షీరామృతాన్ని నివేదింది భక్తులకు వినియోగం చేశారు. కార్యక్రమంలో ఆలయ వైదిక, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T04:35:28+05:30 IST