ఇకనుంచి రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50

ABN , First Publish Date - 2021-04-17T17:07:46+05:30 IST

బెంగళూరు డివిజన్‌లోని పలు రైల్వేస్టేషన్‌లలో సాధారణ రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు పెద్దపెట్టున వలస కూలీలు తరలి వస్తున్నారు.

ఇకనుంచి రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50


బెంగళూరు: బెంగళూరు డివిజన్‌లోని పలు రైల్వేస్టేషన్‌లలో సాధారణ రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు పెద్దపెట్టున వలస కూలీలు తరలి వస్తున్నారు. అనవసరంగా రైల్వేస్టేషన్‌లకు వచ్చే వారిని నియంత్రించే దిశలో భాగంగా ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను ఈ నెల 17 నుంచి తిరిగి పెంచబోతున్నారు. ప్రస్తుతం 10 రూపాయలుగా ఉన్న టికెట్‌ను రూ.50కు పెంచారు. ఈ నెల 30 వరకు ఈ ఆదేశాలు బెంగళూరు సిటీ, యశ్వంతపురం, కంటోన్మంట్‌, కృష్ణరాజపురం రైల్వేస్టేషన్లకు వర్తిస్తాయని నగరంలో శుక్రవారం రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2021-04-17T17:07:46+05:30 IST