బెంగళూరులోనే అత్యధిక Covid కేసులు
ABN , First Publish Date - 2022-02-01T17:16:01+05:30 IST
కొవిడ్ కేసులు బెంగళూరు కేంద్రంగానే అత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 24,172 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 10,692 మందికి పాజిటివ్ ప్రబలింది. మిగిలిన ఏ జిల్లాలోనూ
బెంగళూరు: కొవిడ్ కేసులు బెంగళూరు కేంద్రంగానే అత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 24,172 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 10,692 మందికి పాజిటివ్ ప్రబలింది. మిగిలిన ఏ జిల్లాలోనూ 1400కు మించి నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 30,869 మంది కోలుకోగా బెంగళూరులో 8,813 మంది ఉన్నారు. 56మంది మృతి చెందగా బెంగళూరులో 12, బెళగావి, దక్షిణకన్నడలో ఆరుగురు చొప్పున బళ్లారిలో ఐదుగురు, హాసన్లో నలుగురు, కలబుర్గిలో ముగ్గురు కాగా మిగిలిన జిల్లాల్లో ఒకరిద్దరు చొప్పున మృతిచెందారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 2,44,331మంది చికిత్సలు పొందుతున్నారు.