రాజధానిలో 10 వేలు దాటిన Covid కేసులు
ABN , First Publish Date - 2022-01-12T16:54:26+05:30 IST
రాజధాని బెంగళూరు నగరంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వారాంతపు లాక్డౌన్ విధించినా కేసుల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించిన బులెటిన్లో రాష్ట్రవ్యాప్తంగా
బెంగళూరు: రాజధాని బెంగళూరు నగరంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వారాంతపు లాక్డౌన్ విధించినా కేసుల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించిన బులెటిన్లో రాష్ట్రవ్యాప్తంగా 14,473 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 10,800 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 840 మంది డిశ్చార్జ్ కాగా ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు తర్వాత కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదైన జిల్లాల జాబితాలో దక్షిణకన్నడ 583, మైసూరులో 562, తుమకూరు 332 ఉన్నాయి. వారం క్రితం వరకు సింగిల్ డిజిట్లో ఉన్న కరోనా కేసులు అనేక జిల్లాల్లో మంగళవారం నాటికి వంద మార్కు దాటేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని బెంగళూరు నగరంలో మంగళవారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 58,917కు చేరుకుంది.