బెంగాల్లో 22వేలు దాటిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే..
ABN , First Publish Date - 2020-07-06T01:55:03+05:30 IST
బెంగాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇన్నాళ్లూ భారీగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో నెమ్మదిగా కేసులు తగ్గుతుంటే.. ...
కలకత్తా: బెంగాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇన్నాళ్లూ భారీగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో నెమ్మదిగా కేసులు తగ్గుతుంటే.. బెంగాల్లో మాత్రం పెరుగుతున్నాయి. నిన్న మొన్నటివరకు 600కు అటు ఇటుగా నమోదైన పాజిటివ్ కేసులు ఈ రోజు దాదాపు 900 వరకు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22వేలు దాటేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 895 కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. 545 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,126కి చేరింది. వీరిలో 6,658మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 14,711మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 757మంది ప్రాణాలు కోల్పోయారు.