పార్టీని నమ్ముకున్న వారి వెంట ఉంటాం

ABN , First Publish Date - 2022-05-24T05:42:18+05:30 IST

పార్టీని నమ్ముకున్న వారి వెంట ఉంటాం

పార్టీని నమ్ముకున్న వారి వెంట ఉంటాం
రచ్చబండలో మాట్లాడుతున్న పీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌

తాండూరు రూరల్‌, మే 23: కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకున్న వారి వెన్నంటి ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ అన్నారు. సోమవారం నారాయణపూర్‌, గోనూరు, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో రమేశ్‌ రైతులు, ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు. తాండూరు నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు ఉత్తంచందర్‌, జనార్దన్‌రెడ్డి, నర్సింహులు, అశోక్‌కుమార్‌, జగదీష్‌, పెద్దేముల్‌ జెడ్పీటీసీ ధారాసింగ్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శోభారాణి, వెంకటయ్య, వెంకటేష్‌, బస్వరాజ్‌, గోపాల్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:42:18+05:30 IST