పశువులకు అందని వైద్యం

ABN , First Publish Date - 2022-05-22T06:34:51+05:30 IST

మండలంలోని వీరాపురం గ్రామ పా డి రైతులకు పశువైద్యం అందకుండా పోతోంది. మండల కేంద్రాని కి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీలోని గ్రామాల కు పశువైద్యం అందని ద్రాక్షగా మారింది.

పశువులకు అందని వైద్యం
వీరాపురంలో తెరుచుకోని పశువైద్యశాల

వీరాపురం పశువైద్యశాలలో కనిపించని వైద్యులు


చిలమత్తూరు, మే 21: మండలంలోని వీరాపురం గ్రామ పా డి రైతులకు పశువైద్యం అందకుండా పోతోంది. మండల కేంద్రాని కి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీలోని గ్రామాల కు పశువైద్యం అందని ద్రాక్షగా మారింది. పంచాయతీ కేంద్రంలో పశువైద్య ఉపకేంద్రం ఉన్నా, అందులో పనిచేస్తున్న వైద్యులు అం దుబాటులో ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వీరాపురం గ్రామంతో పాటు వెంకటాపురం, హుసేనపురం, భూపసముద్రం, లక్ష్మీపురం, దాదిరెడ్డిపల్లి, దాదిరెడ్డిపల్లి తండా గ్రామాల కు చెందిన మూగజీవాలకు వైద్యం కోసం కర్ణాటకకు వెళ్లక త ప్పడం లేదని వాపోతున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యులు సక్రమం గా విధులకు హాజరుకావడం లేదని, వీలున్నప్పుడు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారని చెబుతున్నారు. దీంతో గొర్రెలు, మేకలు, పాడి ఆవులకు జబ్బులు వస్తే ప్రైవేటు డాక్టర్లను ఆశ్రయించక త ప్పడం లేదంటున్నారు. 


అంతేకాకుండా వీరాపురం వలస పక్షులకు విడిది కేంద్రం. సాధారణంగా ఇప్పుడు వీచే ఈదురుగాలులకు చె ట్లపై నుంచి పక్షులు కింద పడి మృత్యువాత పడటం, కొన్ని గా యాలపాలవడం జరుగుతోంది. ఈ సమయంలో అక్కడ పశువైద్యులు ఉండి వాటికి చికిత్స అందించాల్సి ఉంది. కానీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పశువైద్యశాలలో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-05-22T06:34:51+05:30 IST