శుభ్రతతో సుందరంగా గ్రామాలు
ABN , First Publish Date - 2021-10-19T04:20:56+05:30 IST
ప్రతి ఇల్లు ఎంత స్వచ్ఛందంగా ఉంటుందో ఆ ఊరును సైతం శుభ్రంగా ఉంచుకుంటే ఎంతో సుందరంగా తయారవుతుందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.
ఎమ్మెల్యే కిలివేటి
తడ, అక్టోబరు 18 : ప్రతి ఇల్లు ఎంత స్వచ్ఛందంగా ఉంటుందో ఆ ఊరును సైతం శుభ్రంగా ఉంచుకుంటే ఎంతో సుందరంగా తయారవుతుందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. సోమవారం తడ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేస్తే గ్రామాలు సుందరంగా తయారవు తాయన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా తడ మండలానికి విడుదల చేసిన సుమారు రూ. 6 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమఅయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివయ్య, ఏఎంసీ చైర్మన్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఎంపీపీ కొలవి రఘు, డీసీఎంఎస్ డైరెక్టర్ గండవరం సురేష్రెడ్డి, సర్పంచ్లు ఆర్మూగం, జయప్రదశశికుమార్, మునిరత్నంరెడ్డి, ఉపమండలాధ్యక్షుడు వెంకటేష్, నాయకులు ఉచ్చూరు మునస్వామిరెడ్డి, చంద్రారెడ్డి, కోదండం, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.